Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నేత్రదానం చేసిన వృద్ధుడు విశ్వదీప సేవా సంఘం

నేత్రదానం చేసిన వృద్ధుడు విశ్వదీప సేవా సంఘం

0

నేత్రదానం చేసిన వృద్ధుడు విశ్వదీప సేవా సంఘం

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని శాంతి నగరకు చెందిన మచ్చా వెంకటేశ్వర్లు (74) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు విశ్వదీప సేవా సంఘమునకు సమాచారం అందించగా, వారు కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి కుటుంబ సభ్యుల అంగీకారము తో నేత్రదానమును స్వీకరించారు. జిల్లా అంతత్వ నివారణ సంస్థ, హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ శ్రీకాంత్ ద్వారా నేత్రాలను స్వీకరించడం జరిగిందని వారు తెలిపారు. నేత్రదానానికి సహకరించిన దాత యొక్క కుమారులు రాంబాబు, తేజ మూర్తి, కూతురు సువర్ణ, అల్లుడు విజయ సారధి కు విశ్వ దీప సేవా సంఘం వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి ,వెంకటేష్, రఘు, మాధవ, అక్కులప్ప తదితర సభ్యులు పాల్గొన్నారు.(Story:నేత్రదానం చేసిన వృద్ధుడు విశ్వదీప సేవా సంఘం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version