Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలి 

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలి 

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలి 

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును పొందాలి అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం రూరల్, అర్బన్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. వీరితోపాటు ధర్మవరం ఇన్చార్జి ఎమ్మార్వో సురేష్ బాబు కూడా పోలింగ్ బూత్ ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించారు. తదుపరి పోలింగ్ ఓటు నమోదు కేంద్రాలలో అక్కడివారికి తగిన సూచనలు ఇచ్చి జాగ్రత్తగా ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలపడం జరిగిందన్నారు.మొత్తం నియోజకవర్గంలోని 295 పోలింగ్ బూత్ నమోదు కేంద్రాలలో 127 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఫారం-6 కు60, ఫారం-7 కు 22, ఫారం-8 కు 45 వెరసి 127 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో (ధర్మవరం రూరల్ తో కలిపి) ఫారం-6 కు 60, ఫారం-7 కు 22, ఫారం-8 కు 45 వెరసి 127 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఇన్చార్జి ఎమ్మార్వో సురేష్ బాబు, ఈడిటి ఈశ్వరయ్య, సీనియర్ అసిస్టెంట్ రాఘవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.(Story:ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!