Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఐదేళ్ల చీకట్ల నుంచి కొత్త వెలుగుల్లోకి రాష్ట్ర ప్రజలు

ఐదేళ్ల చీకట్ల నుంచి కొత్త వెలుగుల్లోకి రాష్ట్ర ప్రజలు

ఐదేళ్ల చీకట్ల నుంచి కొత్త వెలుగుల్లోకి రాష్ట్ర ప్రజలు

దీపావళి పండుగ సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ శుభాకాంక్షలు

న్యూస్‌తెలుగు/వినుకొండ : ఐదేళ్ల చీకట్లు చీల్చుకుంటూ కొత్త వెలుగుల్లోకి అడుగు పెడుతున్న వినుకొండ నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. కొత్త నాయకత్వంలో, కొత్తలక్ష్యాలతో అభివృద్ధిబాటలో రాష్ట్రం ముందుకు సాగుతున్న తరుణంంలో వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలందరీ జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యాలు తేవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చల్లని, సమర్థ పాలనలో రాష్ట్రంలోని ప్రతి లోగిలి కొత్తవెలుగులు, సంతోషాలతో నిండాలని ఆ భగవంతుడుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. బుధవారం ఈ మేరకు దీపావళి శుభాకాంక్షల సందేశం విడుదల చేసిన ఆయన ‌ప్రజలందరు సంతోషాలతో భద్రంగా దీపావళి వేడుకలు చేసుకోవాలని అన్నారు. పండగ వెలుగులు చీకట్లను తరిమివేసినట్లే సమస్యలను, సవాళ్లనూ తొలగించి నవ్యాంధ్రప్రదేశ్‌, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారేందుకు బాటలు వేయాలన్నదే ఈ పండుగకు తన సంకల్పం అన్నారు. జగనాసుర విముక్తమై, ప్రజలందరు స్వేచ్ఛా, సంతోషాలతో సంబరాలు చేసుకుంటు న్న ఈ దీపావళి రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. (Story : ఐదేళ్ల చీకట్ల నుంచి కొత్త వెలుగుల్లోకి రాష్ట్ర ప్రజలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!