Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ క్యాన్సర్ పేషెంట్ అనిజ కి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం

క్యాన్సర్ పేషెంట్ అనిజ కి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం

0

క్యాన్సర్ పేషెంట్ అనిజ కి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం

తారక్ చేయూత ట్రస్ట్ ప్రెసిడెంట్ అంకె రామాంజి

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి సంబంధించిన అనిజ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాదులో గల బసవతారకం హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్లడానికి డబ్బులు లేక తారక్ చేయూత ట్రస్ట్ ప్రెసిడెంట్ అంకె రామాంజి నీ సంప్రదించగా వెంటనే స్పందించిన తారక్ చేయూత ట్రస్ట్ సభ్యులు దాతల సహకారంతో హైదరాబాద్ వెళ్లడానికి క్యాన్సర్ పేషెంట్ అనిజ కూతురికి పదివేల రూపాయలు ఖర్చులకు అందించడం జరిగింది జరిగింది అని తారక్చైత అధ్యక్షులు అంకె రామాంజి తదుపరి వారు మాట్లాడుతూ అంతేకాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతోమంది నిరుపేదలకు వృద్ధులకు, వికలాంగులకు, చిన్నారులకు, సహాయం చేయడంలో తారక్ చేయూత ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి చాలామందికి సహాయం అందించడం జరిగిందన్నారు. ఈనెల 29వ తేదీనశ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన మధుప్రియ అనే ఒక చిన్న పాపకు చాలా సీరియస్ గా ఉండి అనంతపురం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలుసుకొని వెంటనే వారికి పదివేల రూపాయలు సహాయం అందించడం జరిగిందన్నారు. ఇలా ఎంతో మందికి సహాయం అందిస్తున్న తారక్ చేయూత ట్రస్ట్ ప్రెసిడెంట్ అంకె రామాంజికి,ట్రస్ట్ సభ్యులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : క్యాన్సర్ పేషెంట్ అనిజ కి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version