Homeవార్తలుతెలంగాణభూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ అంశాలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గణప సముద్రం రిజర్వాయర్ బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి 197 ఎకరాలు నవంబర్ 20 లోపు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, 27 ప్యాకేజీ కింద భూసేకరణ, అవార్డు జారీ ప్రక్రియ నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. గణపురం బ్రాంచ్ కెనాల్ లో కర్నె తండా పార్ట్ లో 171 ఎకరాలు సర్వే కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, ఇర్రిగేష ఎస్. ఈ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఈ. ఈ లు మధుసూదన్ రావు, పంచాయతీ రాజ్ ఈ. ఈ మల్లయ్య, ఏడి సర్వే బాలకృష్ణ, డి. ఈ లు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. (Story : భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics