Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు తేజు దీపిక

క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు తేజు దీపిక

0

క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు తేజు దీపిక

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల ఆర్డిటి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ధర్మవరంలో పెనుకొండ అండర్-16 అమ్మాయిలు జట్టు, ధర్మవరం అండర్-16 అమ్మాయిలు జట్టు క్రికెట్లో తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ధర్మవరం జట్టు 30 ఓవర్లలో 287/3 పరుగులు చేసింది.ధర్మవరం జట్టులోని తేజు దీపిక 142 (103) పరుగులతో సత్తా చాటింది అని కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తదుపరి బ్యాటింగ్‌కి దిగిన పెనుకొండ జట్టు 16.4 ఓవర్లలో అలౌట్ అవడం జరిగిందన్నారు. ధర్మవరం జట్టు 246 పరుగుల తేడతో విజయం సాధించింది అని తెలిపారు.ధర్మవరం జట్టులోని చందన 3 వికెట్లు, బృంద 3 వికెట్లు చేశారన్నారు. అని కోచ్ రాజశేఖర్ తెలియజేసారు.(Story:క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు తేజు దీపిక)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version