Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి

ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి

ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి

నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర

న్యూస్‌ తెలుగు/విజయవాడ : అక్టోబర్‌ 22న పునమిఘాట్‌, బబ్బురి గ్రౌండ్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న డ్రోన్‌ సమ్మట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో జరగబోవు డ్రోన్‌ షో ఏర్పాట్లను కమిషనర్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానది తీరంలో డ్రోన్‌ షో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పారిశుధ్య నిర్వహణ పక్కాగా జరగాలని వైద్యశాఖకాధికారులను, ఘాట్లు వద్ద ఉన్న రైలింగ్‌లను సరి చూసుకోవాలని ఇంజనీరింగ్‌ సిబ్బందిని ఆదేశించారు, మొక్కలు నాటే అవకాశం ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటి హరితాన్ని పెంచాలని హార్టికల్చర్‌ విభాగాన్ని ఆదేశించారు. ఈ పర్యటనలో సీపీ ప్రసాద్‌, సీఈ శ్రీనాథ్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌ సీఎంవోహెచ్‌ డాక్టర్‌ సురేష్‌బాబు, ఎస్‌ఈ సత్యనారాయణ, అమృత్‌ పథకం జేడీ, యూసీడీ పీవో డా.లత, ఈఈ ఏఎస్‌ఎన్‌.ప్రసాద్‌, ఇంజనీరింగ్‌, శానిటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా పరివాహిక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించండి
వరద హెచ్చరిక నేపధ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచిన 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లో ప్రజలు తమ ఫిర్యాదులు చేయవచ్చని, లోతట్టు ప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు తరలిరావాలని కమిషన్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబందిత అధికారుల సమాచారం మేరకు ప్రకాశం బ్యారేజ్‌లో ప్రస్తుత నీటిమట్టం 57,500 క్యూ సెక్లూ ఉండగా, పులిచింతల ప్రాజెక్టుకు నీటిమట్టం లక్ష క్యూసెక్కులకు పెరగగా, అందుకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజ్‌ నీటిమట్టం కూడా శనివారానికి లక్ష క్యూసెక్కులకు పెరిగే అవకాశాలున్నందున కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. వరద హెచ్చరిక నేపధ్యంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వరదల వల్ల ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా, ఫిర్యాదులున్నా 8181960909 వాట్స్‌అప్‌ ద్వారా తెలియజేయచ్చని, 0866-2427485, 0866-2424172 నంబర్లకు కూడా కాల్‌ చేయవచ్చని తెలిపారు. (Story : ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!