పల్లె పండుగ కార్యక్రమంలో ప్రధాని ఫోటో ఉండాలి
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాలు సందర్భంగా ఫ్లెక్సీలు వాల్ పెయింట్ సిటిజెన్ నాలెడ్జ్ బోర్డులపై తప్పనిసరిగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా ఉండాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తప్పనిసరిగా ప్రధాని, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం, పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం లోగోలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. (Story : పల్లె పండుగ కార్యక్రమంలో ప్రధాని ఫోటో ఉండాలి)