UA-35385725-1 UA-35385725-1

సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి…….

సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి…….

సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్.

న్యూస్ తెలుగు / వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వాడ వాడలా 100 సంవత్సరాల ఉత్సవాలు జరపాలనే జాతీయ సమితి పిలుపుమేరకు పల్నాడు జిల్లాలోని అన్ని పార్టీ శాఖలలో ఘనంగా నిర్వహించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. శుక్రవారం నాడు రాత్రి 7 గంటలకు వినుకొండ పట్టణంలోని అజాద్ నగర్ కాలనీ పి.వి. శివయ్య డివిజన్లో జరిగిన శాఖా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సిపిఐ మనదేశంలో పేద బడుగు బలహీన వర్గాలను చేరదీసి వారి అభ్యున్నతి కోసం కుల మత వర్గ తేడాలు లేని సమ సమాజం కోసం పోరాడిందని ఆనాడు సమాజంలో జమీందారీ జాగీర్దారీ వ్యవస్థలను రద్దు చేయాలని గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య పెత్తం దారులు పేదలు, పేద రైతాంగం పై సాగిస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని కార్మికులు కష్టజీవులకు శ్రమకు తగ్గ ఫలితం సాధించుటకు పోరాటం సాగించి విజయం సాధించిందని, బాల్చన్దొర, నీ కాల్మొక్తా దొర అంటూ దొరల పంచన జీత గాడి జీవితాన్ని అనుభవించిన బడుగు జీవులకు అండగా నిలబడి పోరాటాలకు సిద్ధం చేసిందని. తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రామీణ పేదలను ఐక్యం చేసి నిజాం నిరంకుశ సైన్యానికి సైతం ఎదురొడ్డి పోరాడిందని రైతాంగాన్ని కూలీల పోరుబాటలో ఆనాడు భూస్వాములు అనుభవిస్తున్న పేదల భూములు 10 లక్షల ఎకరాల భూములను పేద కూలీలకు రైతాంగానికి పంచిన చరిత్ర సిపిఐ దన్నారు. మనువాదులు ధ్వంసం చేయాలని చూస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కుల మతాల పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చు రేపే మత విద్వేషాలకు వ్యతిరేకంగా సిపిఐ అనేక దశాబ్దాలుగా పోరాడుతోందని నేడు కూడా కేంద్రంలో అటువంటి శక్తులు పెచ్చరిల్లిపోతున్న నేపద్యంలో మరోసారి మత ఉన్మాదాన్ని పెరిగిపోకుండా భిన్నత్వంలో ఏకత్వం గా బహుళ మతాలు కులాలు అన్నదమ్ముల వలె కలిసి జీవిస్తున్న మనదేశంలో అందరినీ గౌరవించే విధానాన్ని కొనసాగించుటకు, దేశంలోని వామ పక్షవాదులను,లౌకిక శక్తులను ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించుటకు సిపిఐ నిరంతరం శ్రమిస్తోందన్నారు. పల్నాడు జిల్లాలో పార్టీ ఇచ్చిన పిలుపులలో పాల్గొనుచు నియోజకవర్గంలోని అనేక సమస్యలను పరిష్కరించుకొనుచు పులుపుల వెంకట శివయ్య స్ఫూర్తితో ఎర్రజెండా నీడలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో సిపిఐ అనేక పోరాటాలు చేసిందని పార్టీ ఇచ్చిన పిలుపులో భూమికోసం భుక్తి కోసం శ్రమజీవుల బడుగు జీవుల సమస్యల పరిష్కారం కోసం వారి ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు మౌలిక సమస్యల పరిష్కారంకొరకు అనేక పోరాటాలు చేసి అనేక పోలీసు కేసులు ఎదుర్కొని ప్రజలకు వేలాదిమందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వారి మౌలిక సమస్యలపై పోరాడి విజయం సాధించిన చరిత్ర సిపిఐదన్నారు. ప్రజల సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకొనుచు సిపిఐ నాయకత్వం ముందుకు సాగుతుందని ఆజాద్ నగర్ కాలనీ ఇళ్లపట్టాలు మంచినీళ్లు కరెంటు తదితర సమస్యలను పరిష్కారం చేసుకొనవలసి ఉందని ఎర్రజెండా మన నియోజకవర్గంలో జరిపే పోరాటాలకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కె. మల్లికార్జున, సాంబయ్య పిట్టమళ్ల వెంకటేశ్వర్లు, రోశయ్య, జె. వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్, సరోజనమ్మ, రమణమ్మ, కమలమ్మ, రూతమ్మ శాఖ సభ్యులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.(Story:సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి…….)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1