గత ప్రభుత్వ హయాములో మంజూరై నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
బీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్
న్యూస్తెలుగు/వనపర్తి : గత ప్రభుత్వ హయాములో మంజూరై నిలిచిన అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వనపర్తి జిల్లా వనపర్తి పట్టణానికి మంజూరు చేసిన అభివృద్ధి పనులకునిధుల మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్
వినతిపత్రం ఇవ్వడం అందించారు. జిల్లా కేంద్రాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భవిష్యత్తు తరాల కోసం ముందు చూపుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అందులో ముఖ్యంగా పట్టణానికి తలమానికంగా కేంద్రప్రభుత్వ ఆధీనములో ఉన్న ఫారెస్ట్ నుండి
అనుమతులు పొంది బై పాస్ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు.
ఇట్టి బై పాస్ రోడ్డు పనులు పెండింగ్లో ఉన్నాయిఅని పట్టణ ప్రజల చిరకాల స్వప్నం అయిన రోడ్ల విస్తరణ
విజయవంతం చేయగా 10శాతం పనులు అనగా కన్యకాపరమేశ్వరి ఆలయం ఎదురుగా మరియు రామా టకీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు మరియు పాలిటెక్నిక్ కళాశాల నుండి మర్రికుంట వరకు రోడ్డు
విస్తరణ పనులు పెండింగ్లో ఉన్నాయిఅని, కోట్ల రూపాయలు నిధులతో చేపట్టిన సామూహిక మార్కెట్ యార్డ్ కూడా వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి, గులాం ఖాదర్ ఖాన్, నీల స్వామి,వేణు గోపాల్ నాయుడు,సయ్యద్. జమీల్,స్టార్.రహీమ్,A.K పాషా, చిట్యాల.రాము,లక్ష్మణ్ గౌడ్,శివప్రసాద్ గౌడ్, సిరివాటి.శంకర్,ఎం.డి.అలీం,ఎం.డి.నవాజ్,తదితరులు ఉన్నారు. (Story : గత ప్రభుత్వ హయాములో మంజూరై నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి)