Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పండిత్ దీన్ దయాల్ కి ఘన నివాళి

పండిత్ దీన్ దయాల్ కి ఘన నివాళి

పండిత్ దీన్ దయాల్ కి ఘన నివాళి

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఏకాత్మత మానవతావాది పండిట్ దీన్ దయాల్ అని మంత్రి సత్యకుమార్ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణలోని బిజెపి కార్యాలయంలో ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆనాడు దేశం వ్యాప్తంగా అధికారం లో ఉన్న కాంగ్రెస్ విధానాలు ఎదుర్కోవడానికి జాతీయ భావాలతో కూడిన పార్టీ ని స్థాపించాలానే ఉద్దేశం తో ఏర్పాటు చేసిన జన సంఘ్ పార్టీ లో ప్రధాన కార్యదర్శి గా భాద్యతలు నిర్వహించారు అని అన్నారు.ఏకత్మాత మానవతావాద సిద్ధాంతాన్ని ప్రవశించి అంత్యోదయ అనే సిద్ధాంతంతో పార్టీ కోసం కృషిచేసిన మహానీయుడు అని అన్నారు.ఆయన ఆదర్శంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోంది అన్నారు. ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బిజెపి అన్నారు.పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆదర్శం గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన సాగిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ నాయకుడుగా వెలుగొందుతూ భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వ గురువుగా నిలబెట్టాలని ఆశయంతో పని చేస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జింకా చంద్రశేఖర్,సాకే.ఓబిలేసు,చంద్ర, డోలా రాజారెడ్డి,గుండా. పుల్లయ్య,చెర్లోపల్లి నారాయణ స్వామి, శ్యాం రావు,నబిరసూల్, జల్లా కార్తీక్ ,గరుగు మల్లికార్జున, మంజునాథ్ నాగరాజు, పల్లా నవీన్,రాధమ్మ,మహాలక్ష్మి, మమత తదితరులు పాల్గొన్నారు. (Story : పండిత్ దీన్ దయాల్ కి ఘన నివాళి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!