Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘనంగా జరిగిన ఉబ్బదేవర కార్యక్రమం

ఘనంగా జరిగిన ఉబ్బదేవర కార్యక్రమం

ఘనంగా జరిగిన ఉబ్బదేవర కార్యక్రమం

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని రజకులు టిడిపి రజక సాధికార సమితి హిందూపురం పార్లమెంట్ కన్వీనర్ శ్రీ మాలవంతం నారాయణస్వామి ఆధ్వర్యంలో ఉబ్బదేవర కార్యక్రమా న్ని బాబా గుడి సర్కిల్లోని ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి సాయిబాబా గుడి వెనక ఉన్న గంగమ్మ గుడి వరకు డప్పు వాయిద్యాలతో , బాణం కుండాలతో ఊరేగింపుగా గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించారు . అనంతరం మాల్యవంతం నారాయణస్వామి మాట్లాడుతూ పుబ్బకార్తిని పురస్కరించుకొని రజకులకు అనాదిగా , సంప్రదాయ బద్దంగా ఏటేటా నిర్వహించుకునే గొప్ప కార్యక్రమం ఉబ్బదేవర కార్యక్రమం అని తెలిపారు. ఉబ్బదేవర కార్యక్రమం ద్వారా గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించడం వల్ల సకాలంలో వర్షాలు పడి చెరువులు , కుంటలు జలకలతో ఉంటూ పాడి ,పంటలతో ప్రజలు సుఖ , సంతోషాలతో ఉండాలని రజకులు గంగమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మస్తానప్ప గారు , సూర్య స్కూల్ నరేంద్ర , మాల్యవంతం వెంకటేశు ,గొడ్డుమర్రి రాజు , సాకే రమేష్ , సురేష్ , అక్కులప్ప , భాస్కర , కొత్తకోట రామంజి తుంపర్తి వెంకటేశు , దుర్గా నగర్ రమేష్ ,రాధాకృష్ణ , రాజు , నాగశేషు ,శంకర ,శ్రీనివాసులు ,గురు ప్రసాద్ , శివ , ఆనంద్, పెద్దన్న , సప్లయర్స్ రాజు పాందుర్తి సీన రాప్తాడు రాజు , ఆరువేటి నాగరాజు , గంగయ్య , ఆటో రామంజి , భగాది , ఇందుకూరు బాబు తదితరులు పాల్గొన్నారు.. (Story : ఘనంగా జరిగిన ఉబ్బదేవర కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!