Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పేద ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్  ముందంజలోనే ఉంటుంది..

పేద ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్  ముందంజలోనే ఉంటుంది..

పేద ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్  ముందంజలోనే ఉంటుంది..

లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పేద ప్రజలకు సేవ చేయుటలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు, కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే లైన్స్ క్లబ్ ద్వారా దాదాపు 60,000 మందికి పైగా ఉచితంగా కంటి ఆపరేషన్ లతోపాటు అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిర దాతగా కీర్తిశేషులు గూడూరు నాగయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరూ కూడా లయన్స్ క్లబ్ వారిచే ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్, అద్దాలు పంపిణీ చేయు విషయాన్ని అందరికీ తెలియజేసే మరింత సేవలను అందిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో 82 మంది కంటి రోగులుకు కంటి పరీక్షలు చేయగా,అందులో 54 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తం ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం శిబిరదాత కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పళ్లెం వేణుగోపాల్, మేటికల కుల్లయప్ప, గూడూరు రాజగోపాల్, సాగ సురేష్, చందా నాగరాజు, రాధాకృష్ణ ,వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!