Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఛ‌లో తెనాలి పోస్టర్ ఆవిష్కరణ

ఛ‌లో తెనాలి పోస్టర్ ఆవిష్కరణ

0

ఛ‌లో తెనాలి పోస్టర్ ఆవిష్కరణ

న్యూస్‌తెలుగు/ వినుకొండ : ఈనెల 21వ తేదీన తెనాలి వ్యవసాయమార్కెట్ నందు మాదిగల విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తారని, ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణములోని తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆవరణలో చలో తెనాలి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సమైక్య ఉపాధ్యక్షులు మాచర్ల బుజ్జి మాట్లాడుతూ ముఖ్య అతిథిగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి నియోజకవర్గం లోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, విద్యార్థులు, మహిళలను వేలాది సంఖ్యలో పాల్గొని ఈనెల 21వ తారీఖున తెనాలిలో జరుగు సభను జయప్రదం చేయాలని, నియోజకవర్గ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరు శ్యామ్, పట్టణ అధ్యక్షులు పందుల కన్నీ, శావల్యాపురం మండల అధ్యక్షులు జోసెఫ్, ఈపూరు మండలం సమన్వయకర్త స్వర్ణ ముసలయ్య, బొల్లాపల్లి మండల అధ్యక్షులు దొరడ్ల పౌలు, నూజెండ్ల మండలం అధ్యక్షులు మంద రాజు, మాదిగ కోటి, పంతుల స్టీవెన్, ఆనంద, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఛ‌లో తెనాలి పోస్టర్ ఆవిష్కరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version