UA-35385725-1 UA-35385725-1

3 నెలల్లో 400 కొత్త బస్సులు 

3 నెలల్లో 400 కొత్త బస్సులు 

 రెండు కొత్త బస్సులు ప్రారంభం

భవిష్యత్తులో అతిపెద్ద మోడ్రన్ బస్టాండ్ నిర్మాణం

 ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

న్యూస్‌తెలుగు/ వినుకొండ : అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆర్టీసీకి 400 కొత్తబస్సులు కొన్న ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కొత్తబస్సులతో పాటు బస్టాండ్‌ల ఆధునీకరణపై కూడా దృష్టి పెట్టి ప్రజారవాణకు కొత్తరూపు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా రాయలసీమకు ముఖద్వారంగా ఉన్న వినుకొండ ఆర్టీసీ డిపోను అన్ని హంగులతో ఆధునికంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో రెండు కొత్త బస్సులను శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. వినుకొండ-హైదరాబాద్ సూపర్ లగ్జరీ, వినుకొండ-విజయవాడ ఎక్స్‌ప్రెస్ బస్సులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీలో నూతన శకం ప్రారంభమైందని అందుకు తగినట్లే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. గత వైకాపా ప్రభుత్వం ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే వందలాది ఆధునాతన సౌకర్యాలున్న బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడం మార్పుకి నిదర్శనమన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నిత్యం ప్రయాణించే 40 లక్షలమందికి డొక్కు బస్సులు తిప్పి ప్రయాణికుల ముప్పు తిప్పలు పెట్టారనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ హయాంలో రద్దు చేసిన పల్లెవెలుగు సర్వీసుల పునరుద్ధరణతో పాటు కొత్తసర్వీసులతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. సీతారాంపురం తండాకు బస్సు సర్వీసును ఏర్పాటు చేశామన్నారు. పేదలకు ఎక్కడ బస్సు సర్వీసు అవసరమైతే అక్కడ ఆర్టీసీ సేవలను మెరుగ్గా అందిస్తామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ సంస్థను లాభాలబాట పట్టించాలని సూచించారు. నూతన బస్సులతో వినుకొండ డిపో కళకళలాడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఇంకా మార్పులు వస్తాయని, ప్రయాణికులకు బ్రహ్మాండమైన సౌకర్యాలు ఉండే విధంగా మోడరన్ బస్టాండ్‌ నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. ఇప్పటికే ఆ విషయమై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో మాట్లాడానని, ఆయన కూడా సూచనప్రాయంగా ఒప్పుకున్నారని, కచ్చితంగా బస్టాండ్ నిర్మాణం చేపడదామన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సహకారంతో భవిష్యత్తులో కొత్త బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే ఇంద్ర బస్సు సర్వీసులను కూడా తీసుకొస్తామని, చెన్నైకు కూడా సర్వీసును ప్రారంభిస్తామన్నారు. అనంతరం డిపోమేనేజర్‌ కోటేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక వినుకొండ డిపోకు 16 కొత్త బస్సులు వచ్చాయన్నారు. 7 సూపర్ లగ్జరీలు, 6 ఎక్స్‌ప్రెస్‌లు, 3 పల్లె వెలుగు బస్సులు అందించారన్నా రు. ఇంద్ర బస్సులు కూడా వచ్చాయని, రిజిస్ట్రేషన్ పూర్తికాక గ్యారేజీలో ఉన్నాయని, త్వరలో వాటినీ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇంకా కొన్ని కొత్త బస్సులు రావాల్సి ఉందని, 15 ప్రైవేట్ బస్సులు రావాలని, ఈ నెలాఖరు నాటికి అవీ సేవల్లోకి వస్తాయన్నారు. కొత్తబస్సుల రాకతో ఇకపై విజయవాడకు 15 నిమిషాల కాల వ్యవధితో దాదాపు 31 బస్సులు తిప్పడానికి అవకాశం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సహకారంతో డిపోను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రోత్సాహకంతో నూతన బస్టాండ్ నిర్మాణం కూడా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు పఠాన్ అయిబ్ ఖాన్, పత్తి పూర్ణచందర్రావు, పెమ్మసాని నాగేశ్వరరావు, సౌదాగర్ జానీ భాష, చికెన్ బాబు, గోల్డ్ కరీముల్లా, బోడెపుడి రామారావు, పలు ఆర్టీసీ అధికారులు సుగుణ, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పి. సాంబశివరావు , వివిధ యూనియన్ ల నాయకులు పాల్గొన్నారు. (Story : 3 నెలల్లో 400 కొత్త బస్సులు )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1