Homeవార్తలుతెలంగాణసైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు

సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు

సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు

అపరిచిత వ్యక్తులకు పాత సెల్ ఫోన్స్ అమ్మ వద్దు 

ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎస్పి డా. శబరిష్

న్యూస్ తెలుగు /ములుగు : అజ్ఞాత వ్యక్తులు ఎవరైన పాత మొబైల్స్ లేదా పాడైన మొబైల్స్ కొంటాం అంటూ మీ దగ్గరికి వస్తె, అప్రమత్తంగా ఉండాలని, ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ సూచించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ
సైబర్ నేరాల్లో వినియోగించేందుకు,పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను, సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులుఅరెస్టు చేశారని ,సుమారు 4000 మొబైల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు..
పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు, విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని, డివైజ్ ఐడెంటిటీ కారణంగా అమ్మకందారులు కూడా, నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారని అన్నారు.అందువల్ల ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండాలని,ఒకవేళ అమ్మినచో అమ్మకందారులు కూడా నేరస్తులుగా పరిగణించబడుతారని తెలియచేసారు.
ఇటువంటి సైబర్ కేటుగాళ్ల ముఠాల వల్ల అమాయక ప్రజలు తమ కష్టార్జితం ద్వారా సంపాదించిన డబ్బును కోల్పోతున్నారని, కావున ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని ఎస్పీ సూచించారు. (Story : సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!