థమ్స్ అప్ ఒలింపిక్స్ ప్రచారం ప్రారంభం
న్యూదిల్లీ: కోకా-కోలా కంపెనీ ఆధ్వర్యంలోని దేశీయ బిలియన్-డాలర్ పానీయాల బ్రాండ్ అయిన థమ్స్ అప్, రాబోయే పారిస్ 2024 ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు సంబంధించి తన కొత్త ప్రచార కార్యక్రమం ‘ఉఠా థమ్స్ అప్, జగా తూఫాన్’ని ప్రకటించడం పట్ల థ్రిల్గా ఉంది. ఈ ప్రచారం చూసేందుకు సాధారణ మైంది గానే కనిపిస్తుంది కానీ శక్తివంతమైన ఆలోచనపై ఆధారపడిరది: అథ్లెట్లపై ‘ థమ్స్ అప్’ ప్రేరేపిత ప్రభావం వారు తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి వారిని ప్రోత్సహిస్తుంది. మన అథ్లెట్లు డైనమిక్ ‘తూఫాన్లు’, వారు తమ అంతర్గత శక్తిని విశ్వసించేలా దేశాన్ని ప్రేరేపిస్తారు. కానీ ఒక ఛాంపియన్ రాత్రికి రాత్రి తయారు కారు. ప్రతిసారీ అథ్లెట్కు ఎదురుదెబ్బ తగిలినప్పుడు లేదా తడబడినట్లు అనిపించినప్పుడు, వారి మద్దతుదారులు, కోచ్, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి అందే ఒక సాధారణ థమ్స్-అప్ వారికి విశ్వాసాన్ని తిరిగి పొందడంలో, విజయాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది – ఇదే కచ్చితంగా ఈ ప్రచార కార్యక్రమ సారాంశం. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో కోకా-కోలా కంపెనీ శాశ్వత భాగస్వామ్యంలో భాగంగా, థమ్స్ అప్ 2024 ఒలింపిక్ మరియు పారాలింపిక్ గేమ్లకు అధికారిక అంతర్జాతీయ భాగస్వామిగా కట్టుబడి ఉంది. (Story: థమ్స్ అప్ ఒలింపిక్స్ ప్రచారం ప్రారంభం)