Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి

బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి

బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/విజయనగరం: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపిఎస్ సోమవార0నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలపట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 29 ఫిర్యాదులను స్వీకరించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్పీ ఎం. వీరకుమార్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, డిసిఆర్ సిఐ జె. మురళి, ఎస్బీ సిఐలు కే.కే.వి.విజయనాధ్, ఈ.నర్సింహ మూర్తి, డిసిఆర్బి ఎస్ఐ మురళి మరియు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు. (Story : బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!