Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

జనసేన నాయకులు గురాన అయ్యలు

న్యూస్‌తెలుగు/విజయనగరం : జూలై 18 నుండి 28 వరకు జనసేన పార్టీ చేపట్టబోయే నాల్గవ విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు…ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు… క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు,వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఉద్యమంలా పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును చేపట్టాలన్నారు.పార్టీ జనాల్లోకి వెళ్లాలంటే క్రియాశీలక సభ్యులదే కీలకపాత్ర అన్నారు. కేవలం 500 రూపాయలు రుసుముతో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద భీమా, ప్రమాదంలో గాయపడిన వారికి 50 వేల రూపాయల మెడికల్ ఖర్చులు అందించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఆయన తెలిపారు. ఈ సదుపాయం వల్ల ప్రతి జనసేన నాయకుడు, కార్యకర్త కుటుంబానికి భరోసాగా ఉంటుందనే ఉద్దేశంతోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో సభ్యత్వం నమోదు చేసుకున్న వారు కూడా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. (Story : క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!