UA-35385725-1 UA-35385725-1

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

విజ‌య‌న‌గ‌రం (న్యూస్‌తెలుగు): రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం విజయనగరం డిపో పరిధిలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించుటకు కామాక్షినగర్ లో గల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. డిపో మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుత కాలంలో యువత ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారని తెలిపారు. ఇందుకు కారణం వారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారానే జరుగుతున్నాయ‌న్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ఎమ్. జ్యోతి ,డిపో మేనేజర్. జె. శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ బి. ఆదినారాయణ, ఆర్. టి. సి. సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ వై. కాసులమ్మ, డిపో సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ ఎమ్. రాజు పాల్గొన్నారు. (Story: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు).

See Also: 

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1