ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తాం
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహ్మద్ జమాల్ ఖాన్ నాయకత్వంలో తుమ్మల పంచాయితీ పరిధిలోని సరివెళ్ల గ్రామం మరియు నారాయణపురం గ్రామాలలో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అలాగే గ్రామం మధ్యలో ఉన్న చంద్రవంక వాగును పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ముర్రం సీతారామయ్య, ముర్రం మల్లయ్య, చింతూరు మండల యువత అధ్యక్షులు మహ్మద్ రియాజ్, నాగమంగ వేణి, సాల్మన్ రాజు, అనిగి చంద్రయ్య, కరణం లక్ష్మయ్య పాల్గొన్నారు.(Story : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తాం )

