అక్రమంగా తరలిస్తున్నరేషన్ బియ్యం పట్టివేత
న్యూస్ తెలుగు/సాలూరు : అక్రమంగా తరలిస్తున్న 891 కేజీల పిడిఎస్ రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని సాలూరు పోలీసు పట్టణ సిఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాలూరు టౌన్ పోలీస్ వారికి రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు సాలూరు టౌన్ పరిధిలో గల పెద్ద బజారు లో అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యాన్ని ముద్దాయిలైన 1. గంట చందు సన్నాఫ్ లేటు రామకృష్ణ, 45 వైశ్య క్యాస్ట్, నాయుడు వీధి సాలూరు టౌన్, 2. మండ కామేశ్వరరావు సన్ ఆఫ్ లేటు వెంకట్ రాజు, 60 వైశ్య కులం, పెద్ద కోమటి పేట సాలూరు టౌన్ ఈ ఇద్దరినీ అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. ఈ మొత్తం 49 పిడిఎస్ రైస్ బస్తాలను, 981 కేజీలు రైస్ ను స్వాధీనం చేసుకొని .మంగళ వారం సీజ్ చేసామని తెలిపారు. మొత్తం పిడిఎస్ రైస్ ను సాలూరు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారికి అప్పగించడం జరిగిందని తెలియజేశారు.(Story:అక్రమంగా తరలిస్తున్నరేషన్ బియ్యం పట్టివేత)

