సౌత్ జోన్ బాల్ బాడ్మింటన్ పోటీల్లో సమీరాకు రజతం
న్యూస్ తెలుగు/వినుకొండ : తమిళనాడులోని తెన్కాసిలో జరిగిన 44వ సీనియర్ సౌత్ జోన్ బాల్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడిన ఆకుమల్ల సమీరా రజత పతకం సాధించింది. శానంపూడి గ్రామానికి చెందిన ఈమె.. వినుకొండలోని రాధా డిగ్రీ కళాశాలలో చదువుతూ, స్థానిక బీసీ హాస్టల్లో ఉంటూ క్రీడల్లో రాణిస్తోంది. సమీరా అద్భుత ప్రదర్శన పట్ల జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ షేక్ షకీలా దస్తగిరి, తదితర అధికారులు మరియు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆమె మరింత ఎదిగేందుకు అవసరమైన ఆర్థిక మరియు ఇతర సహాయ సహకారాలు అందిస్తామని వారు అన్నారు.(Story : సౌత్ జోన్ బాల్ బాడ్మింటన్ పోటీల్లో సమీరాకు రజతం )

