Homeవార్తలుతెలంగాణచట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి

చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి

చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి వి రజని.

న్యూస్ తెలుగు/వనపర్తి  : చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి వి రజని అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో తాడిపర్తి లోని గాయత్రి బి.ఈ.డి కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గారు పోక్సో మరియు NDPS చట్టం గురించి వివరించారు. ఈ చట్టాల గురించి కాబోయే ఉపాధ్యాయులుగా అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తు తరాలైన విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపించడానికి మార్గం సులువు అవుతుందని అన్నారు. అదేవిధంగా బాల్యవివాహాల నిర్మూలన చట్టం మరియు వినియోగదారుల రక్షణ చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు , గాయత్రి బిఈడి కళాశాల అధ్యాపక బృందం మల్లికార్జున్, మోహన్, సురేష్, వీరభద్రయ్య, నిరంజన్ వలి, నాగేంద్రం మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.(Story : చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!