Home వార్తలు తెలంగాణ అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలోధర్నా

అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలోధర్నా

0

అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలోధర్నా

న్యూస్ తెలుగు/చింతూరు : అఖిల భారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐ టీ డి ఎ ముందు ధర్నా నిర్వ హించారు. అనంతరం పిఒకు మెమొరాండం సమర్పించారు.గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని, అలాగే పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఆ నిర్వాసితులకు నిర్మించిన కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వసతి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కుంజా దూలయ్య మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనుల ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి అయిందని, ముంపు గ్రామాల లక్షలాది కుటుంబాల్లో 12 వేల కుటుంబాలకు మాత్రమే కాగితాల్లో పునరావాసం కల్పించారని, అది కూడా సమగ్రంగా లేదని విమర్శించారు. పోలవరం నిర్వాసితులు పత్తిపాక, తుస్తివారి గూడెం, చిన్న మట్టపల్లి తదితర గ్రామాల ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చి పరిహారం చెల్లించాలన్నారు. అలాగే వీఆర్పురం, చింతూరు, ఎటపాక, కూనవరం మండలాల్లోని పోలవరం నిర్వాసితులకు కాలనీలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, పంచాయతీ కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే 500 మంది ఓటర్లు ఉంటే ఆదివాసి గ్రామాల్లో గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని జీవో నెంబర్ 63 ప్రకారం ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించి కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే ముంపు మండలాల్లో తునికాకు సేకరణ ప్రభుత్వం చేసి ఆదివాసీలకు ఉపాధి కల్పించాలన్నారు. పెరిగే ధరలకు అనుగుణంగా తుని కాకు కట్ట రేటు పెంచాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఐవి రమణ, పల్లాల అశోక్, బాడిశ రామయ్య, గొర్రె సత్యనారాయణ, వంజం మూర్తి, పైదా శ్రీను తదితరులు పాల్గొన్నారు.(Story : అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలోధర్నా )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version