లేబర్ కోడ్ లకు, వ్యతిరేకంగా ఏప్రిల్ 1న బ్లాక్ డే ను పాటించండి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య, వనపర్తి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ తదితరులు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను తీసివేసి నాలుగు లేబర్ కోడులుగా మార్చివేసింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల కార్మికులకు హక్కులు లేకుండా చేసి కార్పొరేట్ కంపెనీలు కార్మికుల శ్రమను దోచుకునే విధంగా నాలుగు లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కార్మిక చట్టాల ప్రకారం కార్మికులు రోజుకు 8 గంటల పని చేసేవారు లేబర్ కోడుల ప్రకారం ఎక్కువ పని గంటలు చేయించుకొని కార్మికుల శ్రమను కార్పోరేట్ కంపెనీలు దోచుకుంటున్నాయి. రైతులు దేశవ్యాప్తంగా 20 కోట్ల కుటుంబాలు ఉన్నాయి బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం రైతులకు ఆదాయం పెంచుతామని చెబుతూనే అమెరికాతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకొని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు దిగుమతి సుoకాన్నీ ఎత్తివేసింది ఈ రకంగా మన దేశంలో పండించిన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్,పాల ధరలు పడి పోవడం వల్ల ఇక్కడి మనదేశ రైతాంగం తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులతోపాటు గతంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు పరుస్తామని చెప్పి నేటికి అమలు చేయకుండా రైతాంగానికి మోసం చేస్తూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూనే ఉన్నది. 4 లేబర్ ఎత్తివేయాలని వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు,వీబి జీ రాంజీ,విత్తన బిల్లులను రద్దు చేయాలని, గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమావేశంలో AISF వనపర్తి డివిజన్ కార్యదర్శి వంశి,కార్మిక నాయకులు మురళి పాల్గొన్నారు. ఏప్రిల్ 1 జరిగే బ్లాక్ డే నిరసనలో కార్మికులు, రైతులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావులు పాల్గొ ని జయప్రదం చేయాలని చెప్పారు.(Story : లేబర్ కోడ్ లకు, వ్యతిరేకంగా ఏప్రిల్ 1న బ్లాక్ డే ను పాటించండి )

