భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాపీ వర్కర్స్ యూనియన్ సమావేశం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక ఏబీఎం కాంపౌండ్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీస్ లో సోమవారం వినుకొండ నియోజకవర్గం తాపీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సండ్రపాటి సైదా పాల్గొని సమావేశం నిర్వహించారు. ఈ సభ కార్యక్రమంలో ఏకగ్రీవం అధ్యక్షులు మల్లెల పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులుగా కాసాని వెంకటేశ్వర్లు, సెక్రెటరీ కొండ్రముట్ల చిన్న సుభాని, జాయింట్ సెక్రటరీ కొచ్చర్ల హుస్సేన్ భాష, ట్రెజరర్ కారుమంచి మీరావలి వీరిని నియోజకవర్గ తాపీ వర్కర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలానే ముఖ్య సలహాదారులుగా సండ్రపాటి సైదా మరియు గుర్రం యలమంద వీరిని నియమించారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల తాపీ వర్కర్స్ నాయకులు పాల్గొన్నారు.(Story : భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాపీ వర్కర్స్ యూనియన్ సమావేశం )
