ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవాసమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు పూల అలంకరణ చేసి, భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కమిటీ వారు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులు వేల సంఖ్యలో స్వామివారి, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ పూజారి శ్రావణ్ కుమార్, అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, సెక్రెటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, ట్రెజరర్ కాళ్ల రామకోటేశ్వరరావు, అన్నా చిన్న సుబ్బారావు, రాముడు, కోటేశ్వరరావు, మోటమర్రి నాగేశ్వరరావు, సన్నీ శెట్టి లక్ష్మీనారాయణ, గుడిపాటి కోటేశ్వరరావు, కొత్త మాస పెద రాములు , గర్రె రూపేష్, కమిటీ సభ్యులు, భక్తులు ద్రోణాల వెంకట అప్పారావు, కుందుర్తి ఆదినారాయణ, ఎలిశెట్టి నాగేశ్వరావు, రేలా వెంకట రెడ్డి పాల్గొన్నారు. (Story:ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం)

