30 కోట్లు స్వాహా చేసిన కాంట్రాక్టర్ పై ఏసీబీ చర్యలేవి ..!
న్యూస్ తెలుగు /సాలూరు : గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించాలని
కేంద్రం రాష్ట్రానికి 10 ఏకలవ్య స్కూల్స్ గురించ నిధులు కేటాయించిందని అందులో భగంగా ఒక్కో భవనానికి 12 కోట్లు నిధులు విడుదల చేసిందనట్రాక్టర్ కృష్ణంరాజు 7 ఏకలవ్య పాఠశాలకు గాను సుమారు 30 కోట్ల స్వాహా చేశాడని రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ కార్యదర్శి గొంప.ప్రకాశరావు ఇంకా అఖిల భారత్ ఆదివాసి వికాస్ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిక్కుల తౌడయ్య ఆరోపించారు. బుధవారం ఈ విషయంపై వారు క్లారిటీ ఇస్తూ 30 కోట్ల స్కాం గురించి పూర్తి ఆధారాలు మేము ఏసీబీ అలాగే విజిలెన్స్ కి కంప్లైంట్ చేస్తే కృష్ణంరాజు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించా రు.అలాగే గతంలో ఇఎన్ సీ శ్రీనివాస్ ఎన్ఆర్జిసినిధులు 50 కోట్లు దుర్వినియోగం చేసి ఇప్పుడు మరలా గిరిజన ఏకలవ్య భవనాల్లో సుమారు 30 కోట్లు అవినీతికి పాల్పడిన ఇది జరిగి తొమ్మిదేళ్లు గడిచిన ఎందుకు భవనాలు పూర్తి స్థాయిలో నిర్మించకుండా కేంద్రం ఇచ్చే నిధులు స్వాహా చేసనా అతనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.ఏకలవ్య పాఠశాల భవాణాల నిర్మాణం కాంట్రాక్టర్ కృష్ణంరాజు తొమ్మిది ఏళ్లు గడిచినా పూర్తి చేయలేదని దీనపై గిరిజన శాఖ మంత్రి అలాగే కేంద్ర ట్రైబల్ కమిషనర్ కు కంప్లీట్ చేశాం గొంప ఇంకా నిక్కల తెలియజేశారు.(Story:30 కోట్లు స్వాహా చేసిన కాంట్రాక్టర్ పై ఏసీబీ చర్యలేవి ..!)
