ఇనాం భూములు, మిగులు భూములు నిరుపేదలకు చెందేల చూడాలని రెవిన్యూ సదస్సులో
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మునిసిపల్ ఆఫీసులో జరిగిన రెవెన్యూ సదస్సులో బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు, ఈపూరు మండలం అంగలూరు, వినుకొండ మండలం శివాపురం, నూజెండ్ల మండలం కొండప్రోలు, వి అప్పాపురం తదితర గ్రామాల్లో ఇనాం భూములు, మిగులు భూములు అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని, రెవెన్యూ అధికారులు పెత్తందారులతో కుమ్మక్కై పేదలకు అన్యాయం చేసే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి నిరుపేదలకు న్యాయం చేయాలని బుధవారం అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడియం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి రెడ్డి బోయిన ప్రసన్నకుమార్, మాల మహానాడు నాయకులు విజయ్, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోట నాయక్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కొమతోటి పౌలు, పిడియం నాయకులు షేక్ మస్తాన్వలి, జి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.(Story : ఇనాం భూములు, మిగులు భూములు నిరుపేదలకు చెందేల చూడాలని రెవిన్యూ సదస్సులో )

