నిరుపేద బ్రాహ్మణ కుటుంబములకు వితరణ
న్యూస్ తెలుగు/వినుకొండ : బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు రఘు ,అత్యుతన స్వాతి ,చింతలపూడి భద్రయ్య ల సహాయ సహకారాలతోసహకారాలతో రఘుమాస్టర్ ఇంటి వద్ద ముగ్గురు నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసరవస్తువులు అందజేశారు. ముందుగా కుందుర్తి రవి కుమారుడు హనుమత్ శాండిల్య హటాత్ మరణాన్ని చింతిస్తూ రెండు నిముషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బ్రాహ్మణ పెద్దలు బ్రాహ్మణ సేవా సమితి చేస్తున్న సేవ కార్యక్రమాల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ముటుకుల శివ,బి.రవికుమార్, జి.వి.మాధవరావు, భువనగిరి సుబ్రహ్మణ్యం , సిహెచ్. భద్రయ్య, పి.నారాయణ రావు, బొడ్డచర్ల ప్రసాద్,దిట్టకవి శ్రీనివాసా చార్యులు, దేవులపల్లి విశ్వనాధ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.(Story : నిరుపేద బ్రాహ్మణ కుటుంబములకు వితరణ )
