Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బిస్కెట్ ప్యాకెట్లతో అమ్మవారి అలంకారం

బిస్కెట్ ప్యాకెట్లతో అమ్మవారి అలంకారం

0

బిస్కెట్ ప్యాకెట్లతో అమ్మవారి అలంకారం

న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక బోసు బొమ్మ సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మంగళవారం ఆలయంలోని మూలవిరాట్ అయిన అమ్మవారికి బిస్కెట్ ప్యాకెట్లతో అలంకరించారు. కళ్యాణ మండపం నందు ప్రత్యేక అలంకారం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి కొలువు తీర్చారు. బాలికలచే ప్రత్యేక నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కమిటీ వారు మాట్లాడుతూ. ఈనెల 22వ తారీకు నుండి వచ్చే నెల 2వ తారీకు వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ వారు నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు తెలిపారు. పది రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం నందు ప్రతిరోజు కుంకుమ పూజలు చండీ హోమాలు వివిధ సాంస్కృతి కార్యక్రమాలు పండగ నాడు సెమీ పూజా కార్యక్రమం అత్యంత వైభవ పేతంగా నిర్వహిస్తున్నట్టు అమ్మవారు ఊరేగింపుతో ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జి, గౌరవ అధ్యక్షులు తాతా వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ అమర్నాథ్, రెడ్డి నగేష్ బాబు, కోశాధికారి పెండ్యాల సురేష్, కొల్లిపర వెంకట నాగేశ్వరరావు, సదావర్తి సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.(Story;బిస్కెట్ ప్యాకెట్లతో అమ్మవారి అలంకారం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version