జాతీయ లోక్ అదాలత్ లో 590 కేసులు పరిష్కారం
న్యూస్ తెలుగు/ సాలూరు : జాతీయ లోక్ అదాల సందర్భంగా 590 కేసులు పరిష్కారం అయ్యాయి. శనివారం సాలూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జ్ జి హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గృహింస,బ్యాంక్ ఇతర కేసులు పరిష్కారం అయ్యాయి. లోక్ అదాలత్ సభ్యులు తాడ్డి తిరుపతరావు, మురళీధర్ పాడి ఆధ్వర్యంలో ఈ కేసులు పరిష్కరించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు టీ జగన్నాథరావు, గొర్లె కిరణ్ కుమార్, తీల్ల మురళి లాయర్లు తోపాటు కక్ష దారులు , పోలీస్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story:జాతీయ లోక్ అదాలత్ లో 590 కేసులు పరిష్కారం)
