గుండ్రాతి ఎల్లన్న గౌడ్ ను సన్మానించిన ఎమ్మెల్యే
న్యూస్తెలుగు/ పెబ్బేరు : ప్రధానోపాధ్యాయునిగా రిటైర్డ్ అయి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గుండ్రాతి ఎల్లన్న గౌడ్ గారిని శాలువా తో ఘనంగా సత్కరించి,అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈశ్వర్ రెడ్డి, నరసింహ గౌడ్,దుర్గా ప్రసాద్, ఖాజా మైనద్దీన్, శివ శంకర్ యాదవ్,రాఘవేందర్ రెడ్డి దయానంద్,చిన్న రాముడు,బాషా, జి.రవి,రాజు తదితరులు పాల్గొన్నారు. (Story:గుండ్రాతి ఎల్లన్న గౌడ్ ను సన్మానించిన ఎమ్మెల్యే)

