పురపాలక సంఘం ఆధ్వర్యంలో డ్రైనేజీలు డీసిల్టేషన్
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా.దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో రాబోయే వర్షాలను దృష్టి లో ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు దుర్గం అన్ని తొలగించి, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డీసిల్టేషన్ చేయించలన్నారు. ఈ భాగంగా బిపిఎస్ 2019 మరియు ఎల్ఆర్ఎస్ 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీసివేత ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని సురేష్ మహల్ రోడ్ ,నరసరావుపేట రోడ్, సిద్దార్థ్ నగర్,ఇసుక వాగు మొదలగు ప్రాంతాల్లో డీసిల్టేషన్ పనులు గత మూడురోజలుగా జరుగుతున్నాయి. ఈ పనులను ఎప్పటి కప్పుడు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఏ. ఈ ఆదినారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పర్యవేక్షిస్తూ పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు డీసిల్టేషన్ చేసే సమయంలో డ్రెయిన్లు పై ఉన్న అడ్డంకులు వారంతట వారే తొలగించి దేసిల్టేషన్ సిబ్బందికి సహకరించాలని కోరారు. 9Story:పురపాలక సంఘం ఆధ్వర్యంలో డ్రైనేజీలు డీసిల్టేషన్)
