శ్రీ లక్ష్మీనరసింహస్వామి 16 రోజుల పండుగ వసంతోత్సవం
న్యూస్ తెలుగు/ వినుకొండ : అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని స్వామివారి కి వసంతోత్సవ సందర్భంగా ఆలయంలో మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పొంగళ్ళు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ పుర ప్రముఖులు సీనియర్ న్యాయవాదులు, పోట్లూరి సైదారావు దంపతులు మరియు ఎక్సేజిపి ఎలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎక్స్ చైర్మన్ జివి రమణ ప్రత్యేక పూజలు పాల్గొని విశ్వమాత గోసంరక్షణ నిర్మాణములను పరిశీలించి అభివృద్ధి చేసిన సేవకులను ప్రత్యేకంగా అభినందించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ. చారిత్రాత్మకమైన ఈ దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థానంలో భక్తులకు సాధువులకు పేదలకు ఆదివారం నుండి దేవస్థానం నుండి వంట ఏర్పాటు చేసి ప్రసాదం పంపిణీ జరుగుతుందని ఆలయ సేవకులు జాజుల మాల్యాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటుకూరి కృష్ణవేణి, పిడతల రమ, పత్తి భ్రమరాంబ, బదిక నరసింహారావు, కాకుమాను రామారావు, బ్రాహ్మణపల్లి అన్నదాన కమిటీ వాటి మీద బజార్ అన్నదాన కమిటీ మహిళా భక్త బృందం విశేషంగా పాల్గొన్నారు. (Story:శ్రీ లక్ష్మీనరసింహస్వామి 16 రోజుల పండుగ వసంతోత్సవం)

