గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు
గర్బాపు నాగేశ్వరరావు మృతి
న్యూస్ తెలుగు /సాలూరు : సీనియర్ జర్నలిస్టు గర్బాపు నాగేశ్వరరావు సోమవారం గుండెపోటుతో మరణించారు.విశాఖపట్నంలో కాస్వి ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన గుండెపోటుకు గురయ్యారు.నాగేశ్వరరావు లీడర్ పత్రిక లో విలేకరిగా పని చేస్తున్నారు .గత 30 సంవత్సరాలుగా వివిధ దినపత్రికలలో విలేకరిగా పని చేశారు.ఎపి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా కూడా పని చేశారు.ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. ఆయన సౌమ్యుడుగా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి మంచితనంతో ఉండేవారు. నాగేశ్వరరావు మృతి కి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ సంతాపం వ్యక్తం చేశారు.స్థానిక జర్నలిస్టు సంఘాల నాయకులు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. (Story:గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు గర్బాపు నాగేశ్వరరావు మృతి)
