సిఐటియు జిల్లా మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన ఎండి జబ్బార్, అధ్యక్షులు జి బాలయ్య
న్యూస్తెలుగు/ వనపర్తి : సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (CITU) వనపర్తి జిల్లా 4వ మహాసభలు పెబ్బేరు పట్టణంలో జూలై 14,15 తేదీలలో సహారా ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. 14వ తేదీన భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటుంది, ఈ సభకు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్స్ వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు ఎండి జబ్బార్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జి బాలయ్య,citu జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి, ఆవాజ్ జిల్లా కార్యదర్శి పెద్ద కాజా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు RN రమేష్, రైతు సంఘం నాయకులు భాస్కర్, ఆహ్వాన సంఘం నాయకులు వీరస్వామి వారు పిలుపునిచ్చారు. 14, 15వ తేదీలో జరగబోయే బహిరంగ సభ, ప్రతినిధుల సభ హాలును ఆహ్వాన సంఘం నాయకులు పరిశీలించారు. (Story:సిఐటియు జిల్లా మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన ఎండి జబ్బార్, అధ్యక్షులు జి బాలయ్య)
