Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాబు రీకాలింగ్ త‌ప్ప‌దు

బాబు రీకాలింగ్ త‌ప్ప‌దు

0

బాబు రీకాలింగ్ త‌ప్ప‌దు

న్యూస్ తెలుగు /సాలూరు : రీకాలింగ్ బాబు మ్యాన్ ఫెస్టో అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారని మాజీ డిప్యూటీ సీఎం మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు. బుధవారం తాడేపల్లి సెక్యూరిటీ చెక్ గేట్ దగ్గర కారు దిగి వైస్సార్ కాంగ్రెస్ ఆఫీస్ లో వై స్ జగన్ మీటింగ్ కి హాజరయ్యారు మాజి ఉప ముఖ్య మంత్రి రాజన్న దొర ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు పార్టీ ఎమ్మెల్యేలు. ఎంపీలు, సీనియర్ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు వైయస్సార్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రీకాలింగ్ బాబు మ్యాన్ పెస్టో అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఇక ప్రజల కోసం ఈ ప్రభుత్వంపై యుద్ధం చేయాలనన్నారని తెలిపారు.చంద్రబాబు నాయుడు చేస్తున్న. పచ్చి మోసాలన్ని ప్రజల్లోకి గ్రామస్థాయి నుండి ఇన్చార్జిలను నియమించి వారిద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ అన్నారని అన్నారు. కూటమి పాలన ఏడాది అయిందని. హనీమూన్ ముగిసిందని ఇక ప్రజల్లోకి వెళ్లి వీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు వివరించి ఎండగట్టాలని అన్నారని తెలిపారు.. రెడ్ బుక్ పాలనలో లో రాజ్యాంగం నిల్ అని అన్నారని తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ ఐదేళ్లు పరిపాలన చేసామని పథకాలన్నీ అన్ని వర్గాలకి అందాయని అన్నారని అన్నారు. కుటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పాలనలో ఎంత ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుందో ప్రజలందరికీ తెలిసినని ఈ వ్యతిరేకతను ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారని తెలియజేశారు. (Story:బాబు రీకాలింగ్ త‌ప్ప‌దు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version