Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి

నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి

నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి

జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్

న్యూస్ తెలుగు/సాలూరు : ప్రతీ వారం పిజిఆర్ఎస్ కు వచ్చే దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు.
సోమవారం సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు అధికారి కె.రామ చంద్రరావుతో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వేగం, నాణ్యత, నిష్పక్షపాతంగా పిజిఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
పిజిఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి దరఖాస్తుదారునికి చట్టప్రకారం పరిష్కారం చూపించాలన్నారు. ప్రతి సమస్యను మానవతా కోణంలో ఆలోచించి గడువులోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారానికి చివరి వరకు వేచి చూడకుండా గడువులోపే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మొత్తం 154 దరఖాస్తులు వచ్చాయి

🔷 సాలూరు మండలం, గాంధీనగర్ లో నివాసముంటున్న తుపాకుల గణేష్ తనకు కొత్త రేషన్ కార్డును మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.
🔸సాలూరు పట్టణంలోని రాము కాలనీ 23వ వార్డ్ లో నివాసముంటున్న చిక్కాల జ్యోతి తన పేరు మీద లేని కరెంట్ మీటర్ రీడింగ్ వల్ల తన కుమార్తెకు తల్లికి వందనం పధకంలో పేరు లేదని, సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు చేశారు.
🟡సాలూరు పురపాలక సంస్థ పరిధిలో వార్డునెం.14, బంగారమ్మ కాలనీ నుండి యం. మాధవి, రాధ, యం. సౌజన్య, బి.స్వర్ణ లత,వరలక్ష్మి తదితరులు తమ కాలనీలో సగానికి పైగా ప్రజలు దారిద్ర్యరేఖ దిగువున నివసిస్తున్నారని, కాలనీలో ఉన్న స్నాక్స్ ఫ్యాక్టరీ వల్ల పొగ,కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని దయచేసి ఫ్యాక్టరిని వేరే జన నివాసం లేని చోటుకు తరలించమని కోరుతూ దరఖాస్తు చేశారు.
🟢 సాలూరు పట్టణం నుండి చల్లా సర్వేశ్వరరావు 7 సంవత్సరాల క్రితం సాలూరు లో టిడ్కో ఇంటి కోసం మున్సిపల్ కమీషనర్ పేరు మీద రూ:50వేలు డిడి ఇచ్చామని, ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.
🔹సాలూరు పట్టణంలో 29 వ వార్డు నుండి మర్రి రవణమ్మ తనకు గత 5 సం: నుండి రేషన్ కార్డు ఆపేశారని, భర్త కరోనాతో 2020 లో మరణించారని, తనకు విడో పెన్షన్ రావడం లేదని, రేషన్ కార్డు, పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
🟡 సాంబారు ముండలం, కూర్మ రాజు పేట గ్రామస్తులు కె. తవిటి నాయుడు, సిహెచ్. సింహాచలం లక్ష్మీ సాగరం చెరువు నుండి చిన్న వలస రోడ్డుకి లింకు రోడ్డు మట్టి రోడ్డుకు గ్రావెల్, మెటల్ రోడ్డు వేస్తే, సుమారు 500 మంది రైతులకు సౌకర్యంగా ఉంటుందని దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేశారు.
🔴సాలూరు మండలం, మావుడి గ్రామం నుండి వెంకట తిరుపతి రావు కందులపాలెం నుండి మావుడి కి బిటి రోడ్డు వేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు.
🔹సాలూరు పట్టణం 21 వార్డు గొల్లవీధి నుండి జి. గుణవతి తనకు కరెంట్ బిల్లు కారణంగా తల్లికి వందనం పధకం అందలేదని పరిష్కారించాలని కోరుతూ దరఖాస్తు చేసారు.
ఈ కార్యక్రమంలో
డ్వామా పి డి. కె.రామచంద్ర రావు, ఐసిడిఎస్ పిడి డా.టి. కనక దుర్గ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్ పాల్, డి.ఎం.హెచ్ఓ డా: ఎస్.భాస్కర రావు, జిల్లా పరిశ్రమల అధికారి కె.కరుణాకర్,సాలూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.జయరాం, సాలూరు ఎంపిడిఓ. కె.పార్వతీ, సాలూరు ఇంచార్జ్ మండల రెవెన్యూ అధికారి వి.రంగా రావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి కె.కొండల రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మన్మథ రావు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి కె.సాయి కృష్ణ ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. (sTORY:నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!