Homeవార్తలుతెలంగాణదేశంలో సిపిఐ పాత్ర లేని పోరాటం లేదు : విజయ రాములు

దేశంలో సిపిఐ పాత్ర లేని పోరాటం లేదు : విజయ రాములు

దేశంలో సిపిఐ పాత్ర లేని పోరాటం లేదు : విజయ రాములు

న్యూస్‌తెలుగు/వనపర్తి : దేశంలో సిపిఐ పాత్రలేని పోరాటం లేదని, ఎర్రజెండాను ఎవరు అంతం చేయలేరని సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు అన్నారు. ఆదివారం వనపర్తి సిపిఐ ఆఫీస్ లో వనపర్తి టౌన్ మహాసభ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి కే విజయ రాములు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. దేశంలో సిపిఐ ఆవిర్భవించిన వందేళ్ళలో దేశ స్వాతంత్రం కోసం, తెలంగాణ విముక్తి కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సిపిఐ పోరాడి విజయం సాధించింది అన్నారు. కష్టజీవుల పక్షాన చట్టసభల్లో బయట పోరాటాలు సాగించి అనేక చట్టాలను సాధించిందన్నారు. సిపిఐ పోరాటంతోనే భూసంస్కరణ, పేదలకు ఇండ్లు పింఛన్లు వంటి పథకాలు వచ్చాయన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందని కొందరు అంటున్నారని ఎర్రజెండా శాశ్వతం అన్నారు. ప్రపంచంలో దేశంలో కష్టజీవుల శ్రమ దోపిడి ఉన్నంతకాలం ఎర్రజెండా ఎగురుతూనే ఉంటుంది అన్నారు. దేశంలో రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన హామీల అమలుకై పోరాడాలి అన్నారు. వనపర్తి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లోకి వార్డుల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పోరాడితేనే పార్టీ విస్తృతం అవుతుందన్నారు. అందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని కోరారు.పట్టణ కార్యదర్శి రమేష్,సహాయ కార్యదర్శి ఎర్రకురుమయ్య ప్రతినిధులు చిన్న కురుమయ్య, పృథ్వినాదం,జయమ్మ,శిరీష, శ్రీదేవి,వెంకటమ్మ,ఎత్తం మహేష్,శాంతయ్య,విష్ణు, చందు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. (Story:దేశంలో సిపిఐ పాత్ర లేని పోరాటం లేదు : విజయ రాములు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!