కార్యకర్తలకు పీడిక రాజన్న దొర కృతజ్ఞతలు
న్యూస్ తెలుగు/సాలూరు : వెన్నుపోటు దినం కార్యక్రమానికి నా పుట్టినరోజు కార్యక్రమానికి ఊహలకు అందని విధంగా వచ్చిన వైయస్సార్ పార్టీ కార్యకర్తలకు,నాయకులకు, ప్రజలకు,అభిమానులకు నా శ్రేయోభిలాషులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు రావడం వేరు అధికారంలోని లేనప్పుడు రావడం వేరు ఇలా తరలి రావడంతో నాకు చాలా సంతోషాన్ని మానసిక ఉల్లాసాన్ని ఇచ్చింది అని అన్నారు. ఈలాగే ఈ ఆధారాభిమానులు నాపై నీ ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి కష్టమొచ్చిన అందుబాటులో ఉంటున్నానని, భవిష్యత్తులో కూడా ఉంటానని తెలియజేశారు. (Story:కార్యకర్తలకు పీడిక రాజన్న దొర కృతజ్ఞతలు)