బాప్టిస్ట్ చర్చ్ లో ఘనంగా ప్రారంభమైన విబియస్ తరగతులు
న్యూస్ తెలుగు/ వినుకొండ : స్థానిక ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో గురువారం పట్టణం లోని వివిధ సంఘాలకి చెందిన, గ్రామీణ చర్చస్ నుండి సండే స్కూల్ విద్యార్థులు అత్యధిక సంఖ్య లో విబిఏస్ తరగతులకి హాజరైయ్యారు. సండే స్కూల్ విద్యార్థులకు విరామ బైబిల్ పాఠశాలలో ఆత్మీయ దేవుని మాటలు,పాటలు, స్కిట్స్ పప్పెట్ షోస్ నేర్పించుటకు హైదారబద్ నుండి పందుల ఏమిలి గ్రేస్ హాజరైయ్యారు. విద్యార్థులు బాల్యం నుండి దేవున్ని తెలుసుకొని,దేవుని జ్ఞానం పొంది, దేవునిలో ఎదగాలని విబిఎస్ నిర్వహించడం జరుగుతుందని సంఘాకాపరి రెవ జె స్పర్జన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిహెచ్ రామయ్య, సెక్రటరీ జి. ఆశీ వందనం, ట్రెజరర్ పి. సునీల్ కుమార్, వైస్ సెక్రటరీ కె. వినోద్ కుమార్, పాస్టరమ్మా మేరీ షారోన్,సండే స్కూల్ సూపరిండెంట్ మేరీ రత్నం, టీచర్లు, స్త్రీల కమిటీ ప్రే్సిడెంట్ వై సునీత, సెక్రటరీ కె. ఆశలత జీవన్, వైస్ సెక్రటరీ మ్ విజయ,స్త్రీల కమిటీ వారు,సంఘా పెద్దలు, సంఘాస్తులు, తదితరులు పాల్గొన్నారు.(Story:బాప్టిస్ట్ చర్చ్ లో ఘనంగా ప్రారంభమైన విబియస్ తరగతులు)