Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విజయవంతంగా ముగిసిన పోలవరం ఆర్ఆర్ గ్రామసభ

విజయవంతంగా ముగిసిన పోలవరం ఆర్ఆర్ గ్రామసభ

విజయవంతంగా ముగిసిన పోలవరం ఆర్ఆర్ గ్రామసభ

న్యూస్ తెలుగు/ చింతూరు :చింతూరు మండల కేంద్రంలో 30వ ( ఆఖరి) ఆర్ & ఆర్ గ్రామ సభను ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు ది.07.05.2025 నాడు నిర్వహించడం జరిగినది. ఈ గ్రామ సభలో మొదట అర్హుల మరియు అనర్హుల జాబితాను అధికారుల, ప్రజా ప్రతినిధుల, మీడియా మిత్రుల, మరియు నిర్వాసితుల సమక్షంలో చదివి వినిపించడం జరిగినది. చింతూరు గ్రామంలో మొత్తం 1808 పిడిఎఫ్ లు గాను 1641 మందిని అర్హులు గాను 167 మందిని అనర్హులుగా గుర్తించడం జరిగినది. చింతూరు నందు నివసిస్తూ రెండు జాబితాలో పేర్లు లేని వాళ్ళ నుండి ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ చింతూరు వారు దరఖాస్తులు తీసుకోవటం జరిగినది. గౌరవ జిల్లా కలెక్టర్ పాడేరు వారి ఆదేశాల మేరకు రెండు జాబితాలో పేర్లు లేని వాళ్లను కూడా మాన్యువల్ గా జాబితాలో చేర్చి వారికి కూడా అర్ & ఆర్ ప్యాకేజీ అందించాలని ఇదీ వరకే చెప్పి ఉన్నారు అని దీని నిమిత్తం రెండు జాబితాలో పేర్లు లేని వారని కచ్చితంగా అర్ & ఆర్ ప్యాకేజీ జాబితాలో చేర్చటం జరుగుతుంది అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు పేర్కొన్నారు.
ఈ గ్రామ సభతో పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురి అవుతున్న ఫేజ్ 1బి లో ఉన్న 32 గ్రామాలకు విజయవంతంగా ఆర్ & ఆర్ గ్రామ సభలు నిర్వహించడం జరిగినది. మొత్తం ఈ 32 గ్రామాలకు సంబంధించి మొత్తం 13807 పిడిఎఫ్ లు గాను 12468 మందిని అర్హులుగా 1339 మందిని అనర్హులుగా గుర్తించడం జరిగినదని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ పేర్కొన్నారు. మండలాల వారిగా మొత్తం పిడిఎఫ్ లు వివరాలు ఇవ్వటం జరిగినది.తదుపరి గ్రామసభలో తీసుకున్న అభ్యంతరాలను మరో పది రోజులలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా హౌస్ స్ట్రక్చర్ వాల్యుయేషన్, అర్ & ఆర్ కాలని కోసం భూమి, భూమికి భూమి వంటి అంశాల మీద తదుపరి దృష్టి పెట్టడం జరుగుతుంది అని ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ చింతూరు వారు చెప్పినారు. ఆర్ & అర్, భూమికి భూమి గురించి భూమిని గుర్తించే ప్రక్రియలో ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలతో టీంలను రేపు చేసుకొని భూమి క్వాలిటీ చెక్ చేయటం జరుగుతుం దని చెప్పినారు.తదుపరి ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు త్వరలోనే ముంపుకు గురి అవుతూ 41.15 కాంటూరు లో చేర్చాని గ్రామాలను కూడా ఇరిగేషన్ టెక్నికల్ టీం తో సర్వే చేయించి వాటిని కూడా 41.15 కాంటూరు లో చేర్చి ఆ గ్రామాల నిర్వాసితులకు కూడా ఆర్ & అర్ ప్యాకేజీ అందించే విధంగా కృషి చేయటం జరుగుతుంది అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు పేర్కొన్నారు. ఫేజ్ 1ఏ లో ఉన్న గ్రామాల యొక్క ఆర్& ఆర్ కాలనీల మౌలిక సదుపాయాల పనులు కూడా త్వరలో ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఏ ఒక్క అర్హుడైన నిర్వాసితుడికి అన్యాయం జరగకుండా నా వంతు కృషి చేస్తాను అని ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ చింతూరు చెప్పినారు. ఈ సందర్భంగా మధ్యవర్తుల మాటలు నమ్మి మోసోవద్దని నిర్వాసితులకు మరొకసారి ప్రాజెక్టు అధికారి వారు సూచించారు. ఇన్ని రోజులు గ్రామసభలకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు మరియు ప్రజలకు ధన్యవాదాలు అని చెప్పినారు. ఈ చింతూరు గ్రామసభ లో చింతూరు సర్పంచ్ కారం కన్నరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బాలకృష్ణ   (Story:విజయవంతంగా ముగిసిన పోలవరం ఆర్ఆర్ గ్రామసభ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!