గృహనిర్మాణం కోసం అదనపు సహాయం
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు మండలంలో పి యం ఏ వై గ్రామీణ స్కీం కింద 448 ఇల్లు మంజూరైనవి మరియు పిఎం జన్మన్ పథకం కింద 185 గృహాలు మంజూరైనవి. పూర్తి కాకుండా వివిధ దశలలో ఉన్నటువంటి గృహాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు సహాయం కింద ఎస్టీలకు 75వేలు పి.వి.టి.జులకు లక్ష రూపాయలు అదునపు సహాయం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి ఓ మంజూరు చేయడమైనది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి హౌసింగ్ చీఫ్ సెక్రటరీ జై జైన్ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ తాత బాయ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజబాబు, కలెక్టర్ రంపచోడవరం నియోజకవర్గం శ్రీమతి మిరియాల శిరీష దేవి గృహ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో చింతూరు మండల అధ్యక్షులు ఇల్లా చిన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Story : గృహనిర్మాణం కోసం అదనపు సహాయం)