Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజా సమస్యల పరిష్కారం కోసమే  ప్రజాదర్బార్‌

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే  ప్రజాదర్బార్‌

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే  ప్రజాదర్బార్‌

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శనివారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి. వినుకొండ కొత్తపేటలోని చీఫ్‌ విప్‌ కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 :00 గంటలవరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యలు ఉన్నవారు నేరుగా చీఫ్‌ విప్‌ జీవీని కలసి సమస్యలు వివరించవచ్చని ఆయన కార్యాలయం ప్రతినిధులు సూచించారు. వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 5మండలాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్ కు తరలివచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి సాధ్యమైనంత మేరకు తక్షణమే పరిష్కారాలు చూపిస్తారని పేర్కొన్నారు. మిగిలిన వాటికి వినతుల ద్వారా వచ్చే సమస్యలు ఇక్కడి నుంచే విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. (Story : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే  ప్రజాదర్బార్‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!