Homeవార్తలుతెలంగాణఅభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఖిల్లా ఘనపురం మండలం సల్కెలాపురం గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భూమి పూజ చేశారు
ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో గిరిజన మహిళలు సాంప్రదాయా నృత్యాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సల్కలాపురం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని గౌరారం, మంగనూరు రోడ్లను నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని అభివృద్ధి చాటున అంతా అవినీతిమయం నడిపించారని ఎమ్మెల్యే విమర్శించారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని సెల్కెలాపురం గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఆయన అన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా పథకం అందజేస్తామని వ్యవసాయ కూలీలకు సైతం 12 వేల రూపాయలను అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి చరణ్ రెడ్డి , మురళీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు విజయ్ కుమార్, వెంకట్రావు , రాములు నాయక్, శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణయ్య, గ్రామ అధ్యక్షులు దుర్గయ్య, రవీందర్ రెడ్డి, బాలరాజు యాదవ్ , బాధ్య నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!