Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బావిలో దిగి రైతు కూలీ మృతితో అంతటా విషాదం

బావిలో దిగి రైతు కూలీ మృతితో అంతటా విషాదం

0

బావిలో దిగి రైతు కూలీ మృతితో అంతటా విషాదం

సంఘటన స్థలానికి చేరుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆర్డీవో మహేష్, ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు.

మృతి చెందిన రైతు కూలీ కుటుంబానికి సంతాపం తెలిపిన అధికారులు, ఎమ్మెల్యే సునీత.

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కట్ట కింద పల్లి గ్రామంలో ఓ బావి వద్ద విద్యుత్ మోటార్ ను బయటికి తీసుకునే సమయంలో రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన దాసరి రామాంజనేయులు(43) అనే రైతు అకస్మాత్తుగా బావిలో పడి మృతి చెందాడు. వివరాలకు వెళితే మోటారు మరమ్మత్తు కోసం బావిలో దిగి ఊపిరాడక నీటిలో మునిగి పోయి మృతి చెందాడు. మృతునితోపాటు పలువురు కూలీలు కూడా కూలి పని నిమిత్తం ధర్మారం మండలం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలోకి వెళ్లారు. బావిలో పుష్కలంగా నీళ్లు ఉండటం వల్ల బావి అడుగుభాగాన పాడైపోయిన మోటార్ను పైకి లాగే ప్రయత్నం చేశా రు. బావి అడుగుభాగంలో ఉన్న మోటారుకు తాడు కట్టేందుకు నీళ్లలో మునిగాడు. అయితే బావిలో ముళ్ళపదలు ఎక్కువగా ఉండటంతో వాటిని తగులుకొని బయటకు రాలేక ఊపిరాడిక బావిలోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని తోటి కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించడంతో రూరల్ ఎస్సై శ్రీనివాసులు ఫైర్స్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. వారి సహకారంతో బావిలో ఉన్న నీటిని తోడి ప్రయత్నం చేసి మృతుని కోసం గాలింపు చర్యలు చేపట్టిన రాత్రి వరకు దొరకలేదు. మృతదేహం కోసం పోలీసులు ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా ఎంత ప్రయత్నం చేసినా ఫలితం శూన్యమైంది. ఈ సమాచారాన్ని అందుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు ఆర్డిఓ మహేష్, మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు, బిజెపి నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని ఆరాత.(Story:బావిలో దిగి రైతు కూలీ మృతితో అంతటా విషాదం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version