Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌యుటిఎఫ్  స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయండి

యుటిఎఫ్  స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయండి

యుటిఎఫ్  స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయండి

యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్ ఆర్. రామకృష్ణ

న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : యుటిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్ ఆర్. రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని బిఎస్సార్ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు యుటిఎఫ్ జిల్లా మున్సిపల్ కన్వీనర్ బిల్లే రామాంజనేయులు, స్థానిక నాయకులు రాంప్రసాద్ ,హరిశంకర్ ,ప్రదీప్ కుమార్ తదితరులతో కలిసి యుటిఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ మహాసభల పోస్టర్లను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 10వ తేదీ ఆదివారం రోజున 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కదిరి పట్టణములో జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఎంతో ఆశతో తెచ్చుకున్న నూతన ప్రభుత్వం ఉద్యోగుల కోరికలను మన్నించి పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని, బకాయి పడ్డ డి ఎ, అండ్ పి ఎఫ్, ఏపీ జి ఎల్ ఐ సి మొత్తాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థుల అపార్ నంబర్ జెనరేట్ లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : యుటిఎఫ్  స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!