Home వార్తలు తెలంగాణ ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

0

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ నగేష్ లతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 51 ఫిర్యాదులు వచ్చినట్లు ​కలెక్టర్ ​తెలిపారు.

అవినీతి నిర్మూలనకు ప్రతిజ్ఞ

సమాజంలో అవినీతిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ అన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచన మేరకు అధికారులు, సిబ్బందితో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. భారతదేశ పౌరునిగా అవినీతిని ప్రోత్సహించనని, అవినీతికి పాల్పడనని దేశాన్ని అవినీతి రహితంగా రూపుదిద్దడంలో నావంతు కృషి చేస్తానని ప్రమాణం చేయించారు.
కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డివో పద్మావతి, జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version